క్రైమ్/లీగల్
మానవమృగాలకు 14 రోజుల రిమాండ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 1 December 2019
షాద్నగర్, నవంబర్ 30: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిపై అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు షాద్నగర్ మెజిస్ట్రేట్ పాండునాయక్ 14 రోజుల రిమాండ్ విధించారు. శనివారం పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య నిందితులను బయటకు తరలించేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో తహశీల్దార్, మెజిస్ట్రేటు పాండునాయక్ పోలీస్ స్టేషన్కు చేరుకోగా పోలీసులు నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివను ఆయన ముందు హాజరుపరిచారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.
*నిందితులు ఆరీఫ్, నవీన్, చెన్నకేశవులు, జొల్లుశివ (ఫైల్ ఫొటోలు)