క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గోపాల్గంజ్ (బిహార్): మార్బుల్ ట్రక్కు అదుపు తప్పి రోడ్డుపక్కన నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు చిన్నారులు దుర్మరణం చెందిన ఘటన బిహార్లో సోమవారం చోటు చేసుకొంది. సీనియర్ పోలీసుల కథనం ప్రకారం.. బిహార్లోని గోపాల్ గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సరైయా నరేంద్ర గ్రామంలో గొర్రెలను మేతకు తీసుకెళ్లడానికి రోడ్డుపై నిల్చున్న చిన్నారులపై ఒక్కసారిగా 18 చక్రాల మార్బుల్ ట్రక్కు దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలైనట్లు బారౌలి స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జి సుమన్ మిశ్రా తెలిపారు. అయితే, గోపాల్గంజ్ ఎస్పీ మనోజ్కుమార్ మాత్రం ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. పాట్నాకు వంద కిలోమీటర్లు, జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతులు 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారని పోలీసులు వివరించారు. వీరంతా సరైయా గ్రామానికి చెందిన వారేనని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గోపాల్గంజ్ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.