క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ఎలక్రీటిషయన్ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 August 2019
పెనమలూరు, ఆగస్టు 21: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడిగడపకు చెందిన షేక్ సర్దార్ బాషా(29) ఎలక్రీటిషయన్గా పనిచేస్తున్నాడు. పని మీద కంకిపాడు వెళ్లి వస్తున్నాడు. గంగూరు చైతన్య కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి ముందు వైపు వెళుతున్న కారుకు హ్యాండిల్ తగలటంతో బైక్ పల్టీలు కొట్టింది. రోడ్డు దెబ్బ తగలడంతో సర్దార్ బాషా అక్కడిక్కడే మృతి చెందాడు. సీఐ సత్యనారాయణ వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఎస్ఐలు షేక్ షబ్బీర్, వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
-