బిజినెస్
8న మార్కెట్లోకి కియా కారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 6 August 2019
అమరావతి, ఆగస్టు 5: ప్రపంచ ప్రసిద్ధ కియామోటార్స్ ఈనెల 8న కొత్త కారు ‘సెల్తోస్’ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇందులో భాగంగా సోమవారం సంస్థ ప్రతినిధులు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ఏర్పాటైన యూనిట్ ద్వారా ఏడాదికి 3 లక్షల కార్ల తయారవుతాయని వివరించారు. భవిష్యత్లో 7 లక్షల కార్ల ఉత్పత్తికి చేరుకోగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం టర్కీ, స్లోవేకియాకు ఇంజన్లను ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు.
చిత్రం...సీఎం జగన్ తో భేటీ అయిన కియా కంపెనీ ప్రతినిధులు