క్రైమ్/లీగల్

లారీ ఢీకొని మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, సెప్టెంబర్ 1: మండలంలోని రుద్రపాలెం గ్రామ సమీపంలో లారీ ఢీకొన్న ప్రమాదంలో మోటారు సైకిలుపై వెళుతున్న మహిళ తలకు తీవ్ర గాయాకావడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకొన్నది. గజపతినగరం పంచాయతీ శివారు ఎం.వెంకటాపురం గ్రామంలో నివాసం ఉంటున్న గేదెల మంగ (40) ఒక శుభకార్యానికి బి.రాజేరు మోటారు సైకిలుపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ డీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ తలకు తీవ్ర గాయాలుకావడంతో అక్కడే మృతిచెందింది. మంగ భర్త నాగేశ్వరరావు పెదమేడపల్లి హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాడుడిగా పనిచేస్తుండగా ఇంజనీరింగ్ చదువుతున్న కుమారుడు, తొమ్మిదవ తరగతి చదువుతున్న కుమార్తె కలరు. మృతిరాలు స్వగ్రామం చౌదంతివలసకాగా వెంకటాపురంలో నివాసం ఉంటున్నారు. మృత దేహాన్ని శవ పంచనామా నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.