క్రైమ్/లీగల్
ఎర్రచందనం దుంగలు వాహనం స్వాధీనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 27 August 2018
రొంపిచెర్ల, ఆగస్టు 27: మండలంలోని గానుగచింత పంచాయతీ ఏటిచెరువు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను వాహనంతో సోమవారం మధ్యాహ్నం పట్టుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారం అందడంతో సిబ్బందితో వెళ్లి కాపు కాచామని తమిళనాడు రాష్ట్రం వేలూరు సమీపంలోని మంచుకొండాపురం గ్రామానికి చెందిన ఎం.రాహుల్(27) అనే యువకుడు మినీలారీలో ఆరు ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. 113 కిలోలు బరువున్న ఎర్రచందనం దుంగలతోపాటు వాహనం విలువ రూ.8.39 లక్షలు ఉంటుందని తెలిపారు. అరెస్టు చేసి కేసు నమోదుచేసి కోర్టుకు రిమాండుకు పంపినట్లు ఆయన తెలియజేశారు.