క్రైమ్/లీగల్
పద్మ కేసులో అనుమానితుడు ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హనుమాన్జంక్షన్, ఆగస్టు 26: హనుమాన్ జంక్షన్లో శనివారం సంచలనం రేపిన వివాహితపై హత్యయత్నం కేసులో అనుమానితుడు బత్తుల నూతన్కుమార్ అత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నూదురుపాడు గ్రామ సమీపంలో రైలుపట్టాల వెంబడి విషం సేవించి మృతిచెందినట్లు హనుమాన్జంక్షన్ ఎస్ఐ సతీష్ అదివారం స్థానిక విలేఖర్లకు తెలిపారు. సేకరించిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన బాపులపాడు గ్రామంలో భర్తను విడిచి ఒంటరిగా వుంటున్న పిల్లి పద్మపై హత్యాయత్నం జరిగింది. తీవ్రగాయాలైన పద్మ విజయవాడ అసుపత్రిలో చికిత్స పోందుతోంది. ఆమెపై దాడి చేసింది ప్రియుడు నూతన్కుమార్ అని భావించిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు నాలుగు బృందాలతో ముమ్మర గాలింపుచేపట్టారు. గాలింపు చేస్తున్న పోలీసులకు ఆదివారం సాయంత్రం నూతన్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం వచ్చింది. నరసరావుపేట రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు మృతుని బ్యాగ్లో లభించిన ఆధారాలను బట్టి మృతి చెందినది నూతన్కుమార్ అని పోలీస్వర్గాలు ధృవీకరించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మ తనపై దాడి చేసింది ఎవరూ అనే విషయం ఇంకా స్పష్టం చేయకముందే అనుమానితుడు మృతి చెందాడు.