క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 4 March 2018
హయత్నగర్, మార్చి 3: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామానికి చెందిన బుర్ర లోకేష్(19), వనస్థలిపురానికి చెందిన వైష్ణవి(21).. కొత్తగూడెంలోని విజ్ఞాన్ కళాశాలలో లోకేష్ ఫార్మసీ మొదటి సంవత్సరం, వైష్ణవి బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరు కలిసి శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కవాడిపల్లి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం బోల్తా పడి తీవ్ర గాయాలతో సంఘటన మృతిచెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.