క్రైమ్/లీగల్
ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 26 February 2018
కామేపల్లి, ఫిబ్రవరి 26: ఆర్థిక బాధలు తాళలేక పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. సంఘటనకు గల వివరాలు ఇలా ఉన్నాయి. కామేపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య అనే వ్యవసాయ కూలీ గ్రామంలో కూలీ పనులు చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మనస్థాపానికి గురై 3రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా వైద్య చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.