S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జగదీష్, లిపి జంటగా జె.కె.జి.చౌదరి దర్శకత్వంలో లిపి బార్గవ ప్రొడక్షన్స్, విమన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత డి.వి.మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘అటు ఇటుకాని హృదయంతోటి’.
‘ఆగడు’, ‘బ్రూస్లీ’ చిత్రాల పరాజయంతో కాస్త వెనుకబడిన శ్రీను వైట్ల మళ్లీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన మెగా హీరో వరుణ్తేజ్తో ఓ సినిమా చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుకానున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న ప్రారంభించడానికి సిద్ధమయ్యారట.
అనిల్, నేహ, నిఖిత హీరో హీరోయిన్లుగా పి.రాధాకృష్ణ దర్శకత్వంలో శ్రీపాద ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిషోర్కుమార్ కోట నిర్మిస్తున్న చిత్రం ‘వజ్రాలు కావాలా నాయన’. ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్నివ్వగా కిషోర్కుమార్ కోట స్విచ్చాన్ చేశారు.
హైదరాబాదీ సినిమాల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గుల్లు దాదా (అద్నాన్ షాజిద్ఖాన్) తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజేష్ పుత్ర దర్శకత్వంలో డిక్కీ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం హైదరాబాద్లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
నిఖిల్, ఇషిక, నీరజ్, సమ్రీన్, జాహ్నసాయి, కావేరి, లికిత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తూ రామ్కుమార్ దర్శకత్వంలో జగదాంబ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటాచారి ఎర్రోజు నిర్మిస్తున్న చిత్రం ‘అంతా విచిత్రం’. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్కందుకూరి క్లాప్నివ్వగా రవి జి. కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
మిల్క్భీమ తమన్నా తాజా గా ఊపిరి సినిమా విజయంతో జోరుమీదుం ది. ఇప్పటికే బాహుబలి సినిమాతో అంతర్జాతీయంగా ఖ్యాతితెచ్చుకున్న ఈమెకు ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగిపోయింది. తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ భామ ఈమధ్య బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ సక్సెస్రేట్ అంతంత మాత్రంగానే ఉండడంతో సౌత్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. తాజాగా మరోసారి బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు తెరకు పరిచయమై, ఎనిమిది భాషల్లో దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకుంది నటి రమ్యశ్రీ. ఆమె తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ మల్లి’. రఘుబాబు, ఆకాష్, ఎల్బీశ్రీరామ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతున్న సందర్భంగా నటి, దర్శకురాలు, నిర్మాత రమ్యశ్రీ చెప్పిన విశేషాలు..ఆమె మాటల్లోనే..
ఆనంద్ నంద, రష్మీగౌతమ్ జంటగా బాలాజీ నాగలింగం సమర్పణలో వి సినీ స్టూడియోస్ పతాకంపై డి.దివాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాణాగారి బంగళా. ఈ సినిమాలోని పాటలు శనివారం హైదరాబాద్లో విడుదలయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి సీడీని ఆవిష్కరించారు.
చేపకళ్ల చిన్నది కాజల్ అగర్వాల్ కెరీర్ రోజురోజుకీ తగ్గిపోతోంది అనడానికి ఈ ఉదాహరణ చాలంటూ టాలీవుడ్ సినీ పండితులు ‘సర్దార్ గబ్బర్సింగ్’ చిత్రాన్ని చూపిస్తున్నారు. ఈ చిత్రంలో యువరాణిగా నటించిన కాజల్, అటు ప్రతిభపరంగా, ఇటు గ్లామర్ పరంగా ఎటువంటి మెరుపులు మెరిపించలేకపోయిందని అంటున్నారు. మగధీరలో అద్భుతమైన నటనను కనబర్చిన ఆమె ఈ చిత్రానికి వచ్చేసరికి కుదేలైంది అంటున్నారు.
సిద్ధార్థ్ జాదవ్, జ్యోతి సుభాష్, శరత్ బుటాడియా, శశాంక్ షిండే, జాకీర్ హుస్సేన్ కీలక పాత్రల్లో నటించిన మరాఠి చిత్రం ‘నైజాం సర్కరోడ’. నైజాం, తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో వౌళి ఫిలింస్ పతాకంపై రాజవౌళి అందిస్తున్నారు. రాజ్ దుర్గే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి.