S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈమధ్య రవితేజ కెరీర్ బాగా డల్ అయినట్టు కనిపిస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘కిక్-2’ భారీ పరాజయాన్ని చవిచూడడంతో ఆ తరువాత గట్టి నమ్మకంతో చేసిన ‘బెంగాల్ టైగర్’ ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ రవితేజ తన తదుపరి చిత్రంపై ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలియజేయడంలేదు. ‘బెంగాల్ టైగర్’ సినిమా హిట్ అయినాకూడా వసూళ్లపరంగా అంతగా రాబట్టుకోలేకపోయింది.
జి.వి.ప్రకాష్, శ్రీ దివ్య జంటగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై మణినాగరాజ్ దర్శకత్వంలో జి.హరి రూపొందిస్తున్న చిత్రం పెన్సిల్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాలోని పాటలను ఆన్లైన్లో విడుదల చేసారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గజల్ శ్రీనివాస్, మాధవీలత జంటగా కృష్ణవాస దర్శకత్వంలో లతాశ్రీ చిత్రాలయం బ్యానర్పై పి.ఎం.రవిరాజ్రెడ్డి నిర్మిస్తున్న ‘అనుష్ఠానం’ చిత్రంలోని పాటలు బుధవారం హైదరాబాద్లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత లగడపాటి శ్రీ్ధర్ ఆడియో సీడీని ఆవిష్కరించారు.
చిత్రం రాష్టప్రతి భవన్లో మంగళవారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్టప్రతి ప్రణబ్ చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి (పద్మశ్రీ). నటుడు రజనీకాంత్ (పద్మవిభూషణ్),
చిత్రం గాయకుడు ఉదిత్ నారాయణ్ (పద్మభూషణ్), నటీమణి ప్రియాంకచోప్రా(పద్మశ్రీ) పురస్కారం అందుకున్నారు.
ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్లో బిజీగా వున్నాడు మహేష్బాబు. ఇప్పటికే పూర్తికావచ్చిన ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్తో ఓ సినిమా చేస్తాడన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో తెరకెక్కే ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాతోపాటు మరో తమిళ దర్శకుడికి అవకాశం ఇచ్చేందుకు రెడీ అయ్యాడు మహేష్.
స్టార్ హీరో కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ దక్కినా కూడా వచ్చిన రెండు మూడు సినిమాల్ని చేసి ఆకట్టుకున్న ఈ భామకు ఈమధ్య వరుస పరాజయాలు పలకరిస్తుండడంతో పాపం అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో అవకాశాలు పట్టేందుకు మేగజైన్ల కోసం హాట్ హాట్గా ఫోజులిస్తూ రెచ్చిపోతోంది. ఇప్పటికే చాలాసార్లు తన అందాన్ని ఎరగావేసినా పెద్దగా లాభం లేకపోయింది.
ప్రముఖ నటుడు సూర్య, సమంత జంటగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ‘24’ చిత్రంలోని పాటలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు. 2డి ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ పతాకాలపై కె.ఇ.జ్ఞానవేల్రాజా సమర్పణలో రూపొందిన ఈ ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో కార్తి సీడీని ఆవిష్కరించారు.
బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ను ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2016’ అవార్డు వరించింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకుంది. అంతర్జాతీయ వేదికపై భారతీయురాలిగా బాధ్యత నిర్వహించేందుకు ఈ గౌరవం ఎంతో ఉపకరిస్తుందని ఆమె అన్నారు. ఈ అవార్డును తన కుమార్తె ఆరాధ్యకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన మరో 17మందికి కూడా ఈ పురస్కారాన్ని అందజేశారు.
అందాలతార సన్నీలియోన్ని బిగ్బాస్ షో స్టార్ని చేసింది. ఆ తరువాత ‘జిస్మ్-2’తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి రసిక హృదయాలని కొల్లగొట్టి క్రేజీ భామగా మారింది. ఇప్పుడు బాలీవుడ్లో సన్నీలియోన్ హవానే జోరుగా కొనసాగుతోంది. ఆమెతో సినిమాలు చేయడానికి ఇంకా దర్శక నిర్మాతలు క్యూలో వెయిట్ చేస్తున్నారు కూడా. తనదైన గ్లామర్తో ఆకట్టుకుంటున్న ఈ భామ ఇకపై నిర్మాతగా మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ప్రముఖ హీరోయిన్ త్రిష టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘నాయకి’. గోవి దర్శకత్వంలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో త్రిష పాడిన పాటను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ, త్రిష పాడిన పాటకు మంచి స్పందన వస్తోందన్నారు.