S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/14/2018 - 22:12

తవణంపల్లి, సెప్టెంబర్ 14: మండల పరిధిలోని వెంగంపల్లిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఎస్సై ఉమామహేశ్వర రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, వెంగంపల్లి గ్రామానికి చెందిన మొగిలి రెడ్డి (46) గురువారం రాత్రి గ్రామ సమీపంలోని తన పంట పొలాల వద్ద పశువులకు కాపలాగా పడుకొన్నాడు. శుక్రవారం వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసారు.

09/14/2018 - 22:08

కళ్యాణదుర్గం, సెప్టెంబర్ 14 : అప్పుల బాధ తాళలేక మండల పరిధిలోని మానిరేవు గ్రామానికి చెందిన ఎట్టి రామాంజి (32) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు అప్పుల భారంతో పాటు, కుటుంబ సమస్యలు భరించలేక గురువారం ఇంటి నుంచి పోయి వ్యక్తి రాత్రి గ్రామ సమీపంలో ఉన్న చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

09/14/2018 - 22:08

వజ్రకరూరు, సెప్టెంబర్ 14 : అప్పుల బాధ తాళలేక మండల పరిధిలోని తట్రకల్లు గ్రామంలో రైతు కురుబ సుంకన్న(55) శుక్రవారం పప్పశెనగ మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుంకన్న విష గుళికలు తిన్నాడు. గమణించిన కుటుంబ సభ్యులు ఆటోలో గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

09/14/2018 - 21:56

కడప,సెప్టెంబర్ 14: జిల్లా వ్యాప్తంగా పలు ఇళ్లల్లో దొంగతనాలు చేసి భారీగా దోపిడీకి పాల్పడుతున్న ఘరానా దొంగను షేక్ మహ్మద్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టుచేశారు. శుక్రవారం సాయంత్రం అదనపు ఎస్పీ శ్రీనివాసులురెడ్డి జిల్లాపోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో, అరెస్టుచేసిన దొంగను, స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి,నగదులను పాత్రికేయుల ముందు ప్రవేశపెట్టారు.

09/14/2018 - 21:40

చీపురుపల్లి, సెప్టెంబర్ 14: చీపురుపల్లి మండలంలో పోలీసులు చేపట్టిన ఆకస్మిక దాడుల్లో వేర్వేరు సంఘటనల్లో 11 మందిని అరెస్టు చేసినట్టు ఎస్సై దుర్గాప్రసాద్ శుక్రవారం విలేఖరులకు తెలిపారు.

09/14/2018 - 21:29

నర్సంపేట, సెప్టెంబర్ 14: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ మహిళ దుర్మరణం చెందిన సంఘటన నర్సంపేట మండలంలోని రాజపల్లెలో బుధవా రం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజపల్లెకు చెం దిన కర్ర సరోజన (57) భర్త వీరస్వామి కొనే్నళ్ల క్రితం మృతిచెందాడు. కాగా సరోజన అనారోగ్యంతో బాధపడుతూ మాటపడిపోయ మంచానికే పరిమితిమయింది.

09/14/2018 - 21:27

కేసముద్రం, సెప్టెంబర్ 14: భుక్యారాంతండాలో బుధవారం పసిబిడ్డ చనిపోయిన ఘటనపై గురువారం మహబూబాబాద్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డీఐఓ) అంబరీష్, డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో వైద్యాధికారుల బృందం తండాకు వచ్చి విచారణ జరిపారు. అలాగే ఇనుగుర్తి పీహెచ్‌సీకి వెళ్లి టీకా బ్యాచ్ నెంబర్ ఇతర వివరాలు తెలుసుకున్నారు.

09/14/2018 - 20:25

బిజినేపల్లి, సెప్టెంబర్ 14: మండల కేంద్రానికి చెందిన చీర్ణం కొండయ్య(57) విద్యుదాఘాతానికి గురై గురువారం రాత్రి పొలం వద్ద మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బత్తుల రాములు అనే రైతు అడవి పందుల బెడద కోసం పొలం చుట్టు విద్యుత్ వైర్లతో కంచె ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

09/15/2018 - 21:26

న్యూఢిల్లీ: ఇస్రో గూఢచర్యం కేసులో మాజీ శాస్తవ్రేత్త నంబీ నారాయణ్‌కు ఊరట లభించింది. కేరళ పోలీసులు ఆయనను అనవసరంగా వేధించారంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇందుకుగాను ఆయనకు రూ.50 లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించింది. కేరళ పోలీసులపై మాజీ శాస్తవ్రేత్త చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేసింది.

09/13/2018 - 04:06

వాల్మీకిపురం, సెప్టెంబర్ 12: మదనపల్లె నుంచి తిరుపతికి ప్రయాణికులతో వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కకడే మృతి చెంది, 10 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలంలో జరిగింది.

Pages