క్రైమ్/లీగల్

పురుగులమందు సేవించి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 28: జంగారెడ్డిగూడెంలో ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెంకు చెందిన పోకల నాగ దుర్గాప్రసాద్ ఈ నెల 27వ తేదీ శనివారం జంగారెడ్డిగూడెంలో రవాణా శాఖ కార్యాలయ సమీపంలో ఉన్న ఒక భవనంలో పురుగుల మందు సేవించి స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో విషయం తెలుసుకున్న స్నేహితులు దుర్గాప్రసాద్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ దుర్గాప్రసాద్ మృతి చెందాడు. ఇదిలా ఉండగా నాగ దుర్గాప్రసాద్ పదవ తరగతి చదువుతున్న సమయంలో కంటికి శస్తచ్రికిత్స జరగడంతో చూపు కొద్దిగా మందగించింది. చదువులో సైతం వెనుకబడటం, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. కూలీ పనిచేస్తూ జీవనం సాగించే తండ్రి సీతారాముడు చదువుకుని వృద్ధిలోకి రావాలని కొడుకికి నచ్చచెప్పేవాడు. ఇటీవల దసరా సెలవుల అనంతరం గత శుక్రవారం కళాశాలకు వెళ్లిన దుర్గాప్రసాద్ విరామ సమయంలో కళాశాల నుంచి బయటకు వచ్చేశాడు. ప్రసాద్ బయటకు రావడం గమనించిన సిబ్బంది దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తన స్నేహితుడికి ఆరోగ్యం బాగోలేదని స్నేహితుని వద్దే ఉంటున్నానని దుర్గాప్రసాద్ తన తండ్రికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. అయితే శనివారం దుర్గాప్రసాద్ పురుగుల మందు సేవించి మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎస్సై అల్లు దుర్గారావు కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నారు.