బిజినెస్

తమిళనాడుకు పన్ను చెల్లింపుల గడువును పెంచిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/చెన్నై, డిసెంబర్ 5: భారీ వర్షాలతో చెన్నై, మరికొన్ని ప్రాంతాలు జల సంద్రమైన నేపథ్యంలో తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ చెల్లింపులకున్న గడువును పెంచింది. ఈ నెల 20 వరకు ట్యాక్స్‌ను చెల్లించుకోవచ్చని శనివారం స్పష్టం చేసింది. మరోవైపు వరదలతో అతలాకుతలమైన చెన్నై నగరంలో నీటి ఉధృతి తగ్గడంతో బ్యాంకులు నెమ్మదిగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఎస్‌బిఐ, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు తమ ఎటిఎమ్ సేవలను పునరుద్ధరిస్తున్నాయి.