శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

యతి వేషంలోని రావణుడిని సత్కరించి తన వృత్తాంతం చెప్పిన సీతాదేవి( అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిక్షాపాత్ర, కమండలాలు ధరించి, బ్రాహ్మణ సన్న్యాసి వేషంలో ఉన్న రాక్షసుడిని, తనకు కీడుచేసే ఆలోచనలో వున్నవాడిని, విరోధించినా తాను గెలవలేని వాడిని, రాక్షసుడని తెలిసీ, బ్రాహ్మణుడిని పూజించిన విధంగానే ఆయననూ పూజించింది సీతాదేవి. ‘ఇదిగో దర్భాసనం.. ఇక్కడ కూర్చో. ఇదిగో అర్ఘ్యం.. ఇదిగో బాద్యం.. సర్వం సిద్ధం. ఇదిగో నీ ఆహారం కొరకు అడవిలోని పండ్లు.. తృప్తిగా భుజించు’ అని శాస్త్ర ప్రకారం చెప్తున్న సీతను, రాముడి భార్యను, భూపుత్రిని, తన చావుకొరకు రావణుడు బలాత్కారంగా అపహరించాలనుకున్నాడు. అడవిలో మాయా మృగాన్ని వేటాడడానికి పోయిన రామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి వస్తాడేమోనని అడవి వైపు నాలుగు దిక్కులా చూశాడు కాని వాళ్లు కనపడలేదు. యథాప్రకారం అడవి చెట్లు మాత్రం కనపడ్డాయి. అది చూసి సీత మనస్సు భయంతో కలవరపడింది.
(సీతా రామలక్ష్మణులు వున్న పర్ణశాలకు ఉత్తరాన పర్వతాలు, తూర్పున గోదావరి నది వుంది. దక్షిణాన, పడమర అడవి వుంది. మారీచుడు రామచంద్రమూర్తిని పడమటగానే తీసుకుపోయాడు. రావణాసురుడు పోవాల్సింది దక్షిణ మార్గాన కాబట్టి ఆ తోవలో రామచంద్రమూర్తి ఉండకూడదు కదా?)
తనను బలాత్కారంగా తీసుకుపోదలచి రావణుడు ఆ విధంగానే ప్రశ్నించాడని సీత భావించింది. అయినా, అతిథులను, అభ్యాగతులను ఆదరించాల్సిన విధానం చక్కగా తెలిసిన సీత, ఇంగిత జ్ఞానం వున్నది కాబట్టి, రావణుడి మాటలు, వాడి ఆర్భాటం విని - చూసి, వీడు నిజమైన సన్న్యాసి కాదనుకుంటుంది. ఉదర నిమిత్తం సన్న్యాసి వేషం ధరించిన బ్రాహ్మణుడు అనుకుని, అతిథితో అబద్ధం ఆడకూడదని అనుకుంటుంది. వీడు దొంగ సన్న్యాసి కాబట్టి వంచకులకు వంచనతో సమాధానం చెప్పాలి అనీ, అలా చెప్పడం దోషం కాదనీ, అల్ప కాలం ఆలోచన చేసి వాడికిలా చెప్పడం ప్రారంభించింది.
‘మిథిలా రాజు, మహాత్ముడు, జనకరాజు కూతుర్ని. నా పేరు సీత అంటారు. నీకు మేలు కలగాలి. నేను శ్రీరాముడి భార్యను సుమా! సర్వ విధాల భోగోపకరణాలు కలదాన్ని. మనుష్య సుఖాలతో పనె్నండు సంవత్సరాలు మామగారి ఇంట్లో నా భర్తతో కూడి, ఎలాంటి కొరత లేకుండా గడిపాను. ఆ తరువాత మా మామగారు శ్రీరాముడికి పట్ట్భాషేకం చేయాలని పదమూడో సంవత్సరంలో ఆలోచన చేశాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు.
అప్పుడాయన ప్రియమైన భార్య కైక, నా భర్త దేశాన్ని వదిలిపోవాలని, తన కొడుకు రాజ్యానికి పట్ట్భాషిక్తుడు కావాలని, రెండు వరాలు తన భర్తను కోరింది. తన మాట అంగీకరించకపోతే ప్రాణాలు విడుస్తానని బెదిరించింది. నా మామగారు ఆమెను ఎంత ప్రార్థించినా ఆయన విన్నపం చెవిన పెట్టలేదు. ఆ పట్ట్భాషేక విఘ్న కాలానికి నా భర్తకు ఇరవై అయిదు సంవత్సరాల వయసు. నాకు పద్దెనిమిదేళ్ల వయసు. ఇంత లేత వయసు వారు అడవుల్లో ఎలా తిరగగలరో కూడా మా అత్త కైకేయి ఆలోచించలేదు.’
(రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో అరణ్యానికి పోయేటప్పుడు ఆయన వయసు పనె్నండేళ్లు. ఆ సంవత్సరమే సీతా వివాహం. తరువాత పనె్నండేళ్లు అయోధ్యలో సుఖంగా ఉన్నాడు. ఆ తరువాత సంవత్సరం పట్ట్భాషేక ప్రయత్నం కాబట్టి అప్పటికి రాముడికి పాతిక సంవత్సరాలు. అరణ్యవాసం ఆరంభమైన తరువాత ఋష్యాశ్రమాలలో పదేళ్లు గడిపాడు. పంచవటిలో మూడేళ్లు ఉన్నాడు. వనవాసారంభం మొదలుపెట్టి ఇప్పటికి పధ్నాలుగవ సంవత్సరం కాబట్టి, సీతాపహరణ సమయానికి శ్రీరాముడికి ముప్పై ఎనిమిదవ ఏడు, సీత జనకుడికి దొరికింది మొదలు ఆరు సంవత్సరాలు మిథిలలో వుంది. వివాహం తరువాత అయోధ్యలో పనె్నండేళ్లు ఉంది. పదమూడో సంవత్సరం అరణ్యాలకు ప్రయాణం కాగా, వనవాసానికి బయల్దేరి అప్పటికి సీతాదేవికి పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి. కాబట్టి, ఇప్పటికి సీతకు, ముప్పై ఒక్క ఏళ్లు గడిచాయి. ఇది ముప్పై రెండో ఏడు.’
సీత రావణుడికి ఇంకా ఇలా చెప్పింది. ‘లోకంలో రాముడు, రాముడు, రాముడు అని స్మరించని వాళ్లుండరు. అంత గొప్ప ఆయనకెలా కలిగిందంటావా? ఆయన అసత్యం చెప్పడు. సద్గుణాల రాశి. తప్పు పట్టటానికి ఒక్క దోషమైనా దొరకదు. స్ర్తిల విషయంలో కానీ, ధన విషయంలో కానీ, నిష్కల్మషమైన హృదయం కలవాడు. సర్వ భూతాలకు మేలుచేసే గుణాలు కలవాడు. ఈ గుణాలన్నీ ఈయనలో కలవని చాటిచెప్పే విధంగా ఆయనకు కమలాల లాంటి పెద్ద కళ్లు, మోకాలినంటే చేతులు కలవాడు. కళ్లు, చేతులు చూడగానే ఈయన మహానుభావుడనే భావన కలుగుతుంది. ఇలాంటి నా భర్తకు తన భార్య ముద్దు తీర్చడానికి దశరథ మహారాజు పట్ట్భాషేకం చేయలేదు. తండ్రి దగ్గరున్న రాముడితో, ఆయన ఆజ్ఞ ప్రకారం రాజ్యాన్ని భరతుడికి ఇచ్చి, పధ్నాలుగేళ్లు అరణ్యాలకు పొమ్మని, తండ్రిని సత్యవాదిని చేయమని కైక చెప్తుంది. తండ్రిని సత్యవచనుడిని చేయడానికి, దేనికీ భయపడని రాముడు, అరణ్యాలకు వచ్చాడు.’
‘నా భర్త సవతి తమ్ముడు, శూరుడు, లక్ష్మణుడు అన్నకు సహాయంగా విల్లు బాణాలు ధరించి మాతో అడవులకు వచ్చాడు. కైక కారణాన్ని రాజ్యాన్ని పోగొట్టుకొని మేం ముగ్గురం అడవుల్లో తిరుగుతున్నాం. కొంచెంసేపు నువ్వు ఇక్కడ వుంటే నా భర్త వస్తాడు. నీకు వనఫలాలు ఇస్తాడు. బ్రాహ్మణుడా! నీ పేరేంటి? నీ గోత్రం ఏమిటి? నువ్వే కులం వాడివి? ఏ జాతివాడివి? వివరంగా చెప్పు. ఎక్కడైనా ఆశ్రమంలో ఉండకుండా ఈ అరణ్యాలలో ఎందుకు తిరుగుతున్నావు?’
సీతాదేవి ప్రశ్నలకు క్రూరపు నడవడికల ఆ రాక్షసుడు తన చరిత్ర చెప్తా వినమని అంటూ, పరుషంగా మాట్లాడాడు.
-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12