క్రైమ్/లీగల్

దైవ దర్శనానికి వెళ్తూ బైక్ పైనుండి పడి మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూలై 23: దైవ దర్శనానికి వెలుతూ బైక్ పై నుండి జారిపడి కనకటి మంజుల (20) అనే మహిళ మృతి చెందిన సంఘటన చందంపేట మండలం ఉస్మాన్‌కుంట వద్ద జరిగింది. చందంపేట మండలం పెద్దమునిగల్ గ్రామానికి చెందిన మంజుల తొలి ఏకాదశి పండుగ సందర్భంగా దేవరచర్ల శివాలయంలో పూజలు చేసేందుకు సోమవారం తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై పెద్దమునిగల్ నుండి దేవరచర్లకు బయలు దేరారు. దారిలో ఉస్మాన్‌కుంట సమీపంలో ఎదురుగా వస్తున్న కిరోసిన్ ట్యాంకర్‌ను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం రోడ్డు దిగుతున్న క్రమంలో మంజుల వాహనం పై నుండి జారిపడింది. దీంతో మంజుల తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది. మంజులకు 7 నెలల పసిపాప ఉంది. శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి చందంపేట పోలీస్‌లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.