క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*మృతుడు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పీఏ *పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తుండగా ఘటన
గజ్వేల్, ఏప్రిల్ 5: గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వద్ద పీఏగా బాలగంగాధర్ పనిచేస్తున్నాడు. తన భార్య విజయతో కలిసి కారులో వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తుండగా మార్గ మధ్యమైన ప్రజ్ఞాపూర్ వద్ద వెనుక నుండి ఓ లారీని ఢీకొట్టారు. దీంతో బాలగంగాధర్(50) అతని బార్య విజయ(48)లు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మృతులు ప్రయాణించిన కారు లారీ కిందికి దూసుకెళ్లడంతో వాహనాన్ని తీసేందుకు పోలీసులు చాలా సేపు శ్రమ పడాల్సి వచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న ప్రజ్ఞాపూర్‌లోని మృతుడు బాలగంగాదర్ బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని గుర్తుపట్టగా ఈ సమాచారాన్ని మృతుని కుటుంబ సభ్యులకు చేర వేశారు. బాలగంగాధర్, విజయల మృతదేహాలను గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా, సీఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని సమీక్షించారు. కేసు దర్యాప్తులో ఉంది.

టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
చిన్నకోడూరు, ఎఫ్రిల్ 5: టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మెట్టుబండల వద్ద గురువారం చోటుచేసుకుంది. చిన్నకోడూరు ఎస్‌ఐ అశోక్ కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువుకు చెందిన మహ్మాద్ హమీద్‌ఆలీ (24), మహ్మాద్ సమీర్(22) ఇరువురు సిద్దిపేటలోని వారి మిత్రుని పెళ్లికి హాజరయ్యారు. సిద్దిపేట పట్టణానికి సమీపం వద్ద జరుగుతున్న రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పనులను తిలకించి వస్తుండగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్న టిప్పర్ ఏపీ 04 విఇ టీఆర్ 4977 నంబర్ గల వాహనం, టీఎస్ 15ఇకే 1173నంబర్ గల బైక్‌ను ఢీకొని వారిపైనుండి వెల్లడంతో ఇరువురు యువకులు అక్కడి అక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి ఏసీపీ రామేశ్వర్, రూరల్ సీఐ సైదులు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసునమోదు చేసుకున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.