హైదరాబాద్
ప్రజావాణితో సమస్యల పరిష్కారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 25 February 2020
హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన మహానగరవాసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో హైదరాబాద్ కలెక్టర్ శే్వతా మహంతి 36 అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించారు. ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ నేరుగా ప్రజలను కలిసి, వారి నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎం.కృష్ణ, ఆర్డీఓలు శ్రీను, వసంత కుమారి పాల్గొన్నారు.