హైదరాబాద్

నమ్మకమే బీజేపీని గెలిపించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : భాతరదేశంలో గత ఐదేళ్ల బీజేపీ పరిపాలనలో మోదీ పై ఉన్న నమ్మకాన్ని ప్రజలు మరోసారి నిరూపించుకున్నారని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి బీ.జనార్థన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో తనను చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సుమారు రెండు లక్షల మంది తమకు మద్దతిచ్చారని, గెలిచినా, ఓడినా ప్రజాసేవ చేయడంలో ముందుంటానని అన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే తాను విజయం సాధిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఓడిపోతే పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పానని అన్నారు. తెలంగాణా నుండి విజయం సాధించిన వారిలో ఎవరికైనా కేంద్రమంత్రి లభించే అవకాశం ఉందని సదరు మంత్రి ద్వారా తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సమీకరించేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో మోడీ పై ఉన్న నమ్మకంతో పట్టం కట్టిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ క్యాడర్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉండి అన్ని రకాలుగా అండగా ఉంటానని ఆయన అన్నారు.