క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 May 2018
షాద్నగర్ రూరల్, మే 29: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఉదయం షాద్నగర్ పట్టణ సమీపంలోని జీఎంఆర్ టోల్ఫ్లాజా వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పరమేశ్ (32), సురేష్ (30) అనే ఇద్దరు యువకులను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. మృతదేహాలను షాద్నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షాద్నగర్ టౌన్ సీఐ అశోక్కుమార్ తెలిపారు.