క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారంపూడి, మార్చి 21: బస్సు నడుపుతూ గుండెపోటుతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలోని పేటసనె్నగండ్ల శివారులో బుధవారం జరిగింది.
మాచర్లకు చెందిన తాజ్‌బాబు (46) పిడుగురాళ్ళ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా పిడుగురాళ్ళ నుండి వినుకొండ వెళ్ళే బస్‌కు డ్రైవర్‌గా వెళ్ళారు.
ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. డ్రైవర్ తాజ్‌బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న పది మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే కారంపూడిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందించారు. బస్సులో కారంపూడి వస్తున్న తహశీల్దార్ సాయిప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని గురజాల ఆర్డీవో మురళీ, ఎస్‌ఐ మనె్నం మురళీ, పిడుగురాళ్ళ రూరల్ సిఐ, డిపో మేనేజర్ వచ్చి పరిశీలించారు.