ఈ వారం స్పెషల్

మహా గణపతిం మనసా స్మరామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాంశ్రేతి వినాయకః’ దుష్టులను విఘ్నములను శిక్షించేవాడు వినాయకుడు. ‘విగతో నాయకః ప్రభుః ఇస్య’ ఆయనకు ఎవరూ నాయకుడు లేడు, కాలేడు. కనుక స్వతంత్రుడగు నాయకుడు - వినాయకుడు. ‘విశిష్టః నాయకః’ ఒకానొక చక్కని విశేషము గల నాయకుడు, నాయకులందరిలోను విశిష్ఠుడు. మహామహిమలు గల సమర్థుడైన నాయకుడు - వినాయకుడు. కనుకనే, నిత్య జీవితంలో ప్రతి పనికీ వినాయకునికి నమస్కరించి - ఆదౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్థం గణ పూజాం కరిష్యే’ అని చెపుతూ విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధి కోసం ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ అని గణపతిని మొదటిగా ఆరాధించటం అనాదిగా వస్తోంది. ఆ గణపతే విఘ్నేశ్వరుడు, ఆయనే వినాయకుడు, ఆది అంతం లేని ఆనందమయ తత్త్వమూర్తి. అకుంఠిత దీక్షతో భక్తి ప్రపత్తులతో కొలిచే వారి కోరికలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే ‘హేరంభుడు’.
నరకుంజరుడు
మన దేవతలలో విచిత్రమైన రూపాలలో దర్శనమిచ్చే దేవతలలో నరసింహుడొకడు, నరకుంజరుడొకడు. నరసింహుడు శ్రీమహావిష్ణువైతే, నరకుంజరుడు మహాగణపతి. ఇద్దరూ దుష్టశిక్షణ శిష్ట రక్షణకు అవతరించినవారే. హిరణ్య కశిపుణ్ణి సంహరించి, ప్రహ్లాదుణ్ణి కాపాడి, పరమాత్మ సర్వాంతర్యామి అని నిరూపించటానికి నరసింహావతారమైతే, మానవులను బాధించే విఘ్నాలనే దుష్ట శక్తులను పారద్రోలి వారి కార్యాలను నిర్విఘ్నంగా సాగించటానికే వినాయకుని అవతారం.
‘తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా దలచితినే హేరంభుని దలచిన నా విఘ్నములను తొలగుట కొరకున్’ అని, ప్రాచీన కాలం నుండి నేటి వరకు అనగా నాటికీ నేటికీ ఏనాటికీ ప్రతి పనికీ ముందు వినాయకుడికి నమస్కరించి పూజిస్తారు.
ప్రకృతి శక్తులే ప్రమధ గణాలు
వాటిని విచ్చలవిడిగా తిరగకుండా సాధకులను బాధించకుండా వాటిని అదుపులో పెట్టుకొని ఆధిపత్యం వహించే మహాశక్తి ఏది ఉందో అది ‘గణపతి’. గణాల కధిపతి. కనుక సత్కార్యాలకు ఎప్పుడూ అంతరాయం కలుగదు, కలుగనివ్వదు. అందుకే ఆయన విఘ్నేశుడు. సత్త్వ రజ తమో గుణాలే అసలు గణాలు. ఇవే కార్యాలకు అడ్డు తగిలి ఫలసిద్ధి లేకుండా చేస్తాయి. గణపతిని ఆరాధిస్తే రజో, తమో గుణాల్ని అణచి, సత్త్వ గుణాల్నిచ్చి, ఆపైన గుణాతీతునిగా ఆశీర్వదిస్తాడు.
గణపతి ఆవిర్భావం: ఆధ్యాత్మిక విశేషాలు
‘గ’ అంటే బుద్ధి, ‘ణ’ అంటే జ్ఞానం. గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి ప్రాప్తిస్తుంది. భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడు ఆవిర్భవించాడు. భద్రమైన పదం - భాద్రపదం. శ్రేయస్కరమైన స్థానం. ఏమిటది? జీవిత గమ్యమైన మోక్షం. శుక్లమైన తేజో రూపం. చతుర్థి అనగా చవితి. జాగృత్, స్వప్న, సుషుప్తులనే మూడవస్థలను దాటిన తరువాతది నాల్గవది. తురీయావస్థ - నిర్వికల్ప సమాధి. ఆయన నక్షత్రం - హస్త. హస్తా నక్షత్రం కన్యారాశిలో ఉంటుంది. కన్యారాశికి అధిపతి బుధుడు, విజ్ఞాన ప్రదాత. మేషరాశి మొదటి రాశి. మేష రాశి నుంచి ఆరవ రాశి కన్యారాశి. ఈ షష్టమ (ఆరవ) భావం - శతృ రుణ రణ రోగములను తెలియజేస్తుంది. మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి, లౌకిక ప్రగతికి ఏర్పడే విఘ్నాలను విశదపరుస్తుందీ భావం. అటువంటి షష్ట భావంలో (హస్తా నక్షత్రం, కన్యారాశి) చంద్రుడుండగా ఆవిర్భవించిన విఘ్నేశ్వరుడు, చవితినాడు పుట్టిన వినాయకుడు, ఈ నాలుగు విధములైన విఘ్నాలను తొలగిస్తానని అభయమిస్తున్నాడు.
జ్యోతిష శాస్త్రాన్వయం
కన్యారాశికి సప్తమ రాశి మీనరాశి. మీనరాశి కాల రాశి చక్రంలో పనె్నండవ రాశి. అనగా వ్యయ రాశి. మేషరాశికి వ్యయ రాశి. పనె్నండవ భావాన్వయాన్ని బంధాన్ని అజ్ఞాత శత్రువుల్ని తెలియజేస్తుంది. ఇక్కడ శత్రువులంటే అంతశ్శత్రువులు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు (ఆరు). ఇవి మానవుని ప్రగతికి విఘ్నాలను కలిగించేవి. హస్తా నక్షత్రాధిపతి అయి, కన్యారాశిలో ఉన్న చంద్రుడు సప్తమ దృష్టితో నేరుగా మీన రాశిని వీక్షిస్తున్నాడు. కనుక వాటిని తొలగించి, జీవితాన్ని సుఖమయం సుసంపన్నం చేసి, లౌకిక, అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చి, మోక్షగతిని ప్రసాదించేవాడు వినాయకుడన్నది, జ్యోతిష శాస్త్రాన్వయం.
భాద్రపద మాస విశేషమేమిటి?
‘్భద్రం కర్ణ్భి శృణు యామ దేవాః భద్రం పశే్య మాక్షభిర్య త్రాః’ అన్నది వేదం. మంగళకరమైన దృశ్యములనే మా కళ్లు చూచునుగాక. దృఢమైన అందములు మంచి శరీర దారుఢ్యం కలిగి భగవంతుడు మాకు ప్రసాదించిన శరీరముతో సదా ఆయనను స్తుతిస్తూ ఆనందింతుగాక. కనుక ‘్భద్ర’మనగా మంగళం, కల్యాణం, శుభప్రదం అని అర్థాలు. భద్రమంటే సామవేద మంత్రం, అని కూడా అర్థం. సామవేద సారం - సంగీతం - నాదోపాసన. లయ యోగములలో కెల్ల సులభ మార్గం. అటువంటిది ‘్భద్ర’మంటే, భద్రమే భాద్రము. ‘్భందతే ఇతి భద్రం’ శుభముల నిచ్చునది. భద్రపదమే - భాద్రపదము. పదము అంటే ఏమిటి? పదము అంటే పదము, జ్ఞానము, పాదము, స్థానము అనే అర్థాలున్నాయి. కనుక శుభప్రదమైన మంగళకరమైన పదములు. పాదములు జ్ఞానము గలది ఏది? వేదవాక్కు. కనుక భాద్రపదము అనగా వేద పదములు అనగా వేద మంత్రముల స్థానం, నిలయం. అంటే విశేష మంగళకర సమాసము భాద్రపద మాసము.
భాద్రపద మాసానికే ‘ప్రోష్ఠ పదము’ అని పేరు. ‘్భద్ర’ అన్నా ‘ప్రోష్ఠా’ అన్నా ఒకే అర్థం - గోవు అని. ‘గో’ పాదముల లాగా నాలుగు పాదములు కలిగి ఉన్నది. భాద్రపద నక్షత్రం భాద్రపద నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం. భాద్రపద మాసం. ఇంత విశిష్ఠమైనది భాద్రపద మాసం.
అటువంటి భాద్రపద మాసంలో, శుక్లపక్ష చవితి రోజున, ఉదయానే్న అభ్యంగన స్నానం చేసి, మట్టితో చేసిన వినాయకుణ్ణి తీసికొని వచ్చి, పూలు 21 రకముల (ఏకవింశతి) పత్రితో పూజ చేసి, కథను విని, నివేదన మంత్ర పుష్పాదులు సమర్పించి కథాక్షతలను శిరస్సున దాల్చుకుంటూ ‘మహాగణపతి ప్రసాదం శిరసా నృహ్లామి’ అని చెప్తారు. ఇది పిల్లలు, పెద్దలు, వృద్ధులు, స్ర్తిలు అందరూ ఆచరించే వినాయక వ్రతం, పూజ.
మట్టి వినాయకుణ్ణే ఎందుకు పూజించాలి?
పంచభూత సదృశ్యమైనది మానవ శరీరం. అందులో మూలాధారం - పృథ్వీ తత్త్వం. ‘మూలాధార చక్ర వినాయకా మూల్యవర ప్రదాయకా, మూలాజ్ఞాన శోక వినాశక మూల కందముక్తి ప్రదాయక..’ అని మహాగణపతిని శ్రీరాగంలో కీర్తిస్తూ ముత్తుస్వామి దీక్షితులు, మూలాధార చక్ర నిలయుడు మహాగణపతి అన్నారు. కనుక పృథ్వి తత్త్వమైన (్భమి, మట్టి) మూలాధార నిలయుడైన గణపతి ఆరాధన మట్టి వినాయక విగ్రహానికే చేయటం, శుభప్రదం శాస్త్ర సమ్మతం.
‘జలభూత శుభాకారం చతుర్గుణ సమన్వితమ్ సర్వ విఘ్న హరం దేవం భజామి గణ నాయకమ్’ శబ్ద స్పర్శ రూప రసములను నాల్గు గుణములు గలవాడు - గణపతి. జల భూతాకారుడు అగుట చేతనే మహా గణపతిని పూజించి, ఆ మట్టి వినాయకుని జలములో నిమజ్జనం చేసే ఆచారం, సంప్రదాయంగా వచ్చింది.
ప్రణవనాద స్వరూపుడు
‘దేవీం వాచమజిన యన్తదేవాః తాం విశ్వరూపాః పశదోవదంతి’ మానవుని అంతశ్శరీరమందున్న చిదాకాశమందు ప్రాణవాయువు, అగ్ని కలయికలో నాదమేర్పడుతుందని మహా యోగులు విశదీకరించారు. ‘ప్రాణానల సంయోగము వల్ల ప్రణవ నాదము సప్త స్వరములై తిరగ’ అన్న సారమతి రాగ కీర్తనలోనే చెప్తాడు - నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి. ఇంద్రియాధిష్ఠాతలైన దేవతలు దైవీవాక్కును సృజించారు. ఆ వాక్కే నాదము. ఆ నాదాన్ని విశ్వమందున్న జీవులు పలుకుతున్నారు. నాదము చిన్మయము. పరమాత్మ ప్రథమ ఆవిర్భావం - ప్రణవ నాదమే. వేద పురాణాగమ శాస్త్రాదులకు, అదే ఆధారం. గణపతి శబ్ద బ్రహ్మ స్వరూపం; అంటే ఓంకార ప్రణవ నాదానికి ప్రతీక. ‘యోవేదాదౌ స్వర ప్రోక్తో వేదాం తీషు ప్రతిష్ఠితః’ అన్నది వేదం. ఆ ఓంకార ప్రణవ నాద స్వరూపుడే మహా గణపతి.
పత్రి పూజ, ఉండ్రాళ్ల నివేదనలోని ఆంతర్యం
వినాయకుని నక్షత్రం ‘హస్త’ అని చెప్పుకున్నాం గదా. హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవగ్రహములకు నవ ధాన్యములు, నవరత్నములు చెప్పబడ్డాయి. నవ ధాన్యములలో చంద్రునికి సంబంధించినవి - బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి ఉండ్రాళ్లు, కుడుములు నివేదన చేయుటలో గల ఆంతర్యం ఇదే.
వినాయకునిది, కన్యారాశి అని చెప్పుకున్నాం కదా. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధునికి నవరత్నాలో ‘పచ్చ’రాయి ఎమరాల్డ్ గ్రీన్ అనగా ఆకుపచ్చ రంగు. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని, ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. సంతుష్ఠుడవుతాడు స్వామి.
గజాననుని రూపం: ఆధ్యాత్మికత
మోక్షసిద్ధికి వక్రమైన ఆటంకములగు అరిషడ్వర్గములను (కామక్రోధములు) నశింపచేసి, చితె్తైకాగ్రత నొసగి, స్వస్వరూప సంధానతతో జీవ బ్రహ్మైక్య స్థితిని అనుగ్రహించువాడు వక్రతుండుడు. మూలాధార క్షేత్ర స్థితుడు.
విఘ్నేశ్వరుని చేతిలోని పాశ అంకుశాలు - రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. గణపతికి ప్రియమైన భక్ష్యం - మోదకం. ఆనందాన్నిచ్చేది, మోదకం. కృపా కటాక్షములతో ఆనందం లభిస్తుంది. నాగయజ్ఞోపవీతం. కుండలినీ శక్తికి సంకేతం. మనిషి క్రోధాన్ని విడిచి అనురాగాన్ని అభివృద్ధి చేసికొని శాంతి సహజీవనంతో, సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు విశ్వప్రేమ భావనా భక్తిని పెంపొందించుకొని జీవితాన్ని చరితార్థత నొందించుకోవాలని సూచించే ఆయుధదారుడు విఘ్నేశ్వరుడు.
‘యుక్తాహార విహారస్య’ అన్నాడు గీతాచార్యుడు. ఆహార నిద్రాదులు అన్నమయ కోశమునకు సంబందించినవి. తమో గుణానికి నిదర్శనము ‘బ్రతకడం ఆహారం కోసమే’ అనుకునే తిండిపోతులు తమోగుణాన్ని చంపుకోలేరు. అటువంటి వారిని గూర్చి ఇతరులు జాలిపడటం, మనసులోనైనా పరిహసించటం సహజం. యోగి అయిన వాడు యుక్తాహార విహారాదులతో, తమో గుణాన్ని జయించి సత్త్వగుణ సంపన్నుడై, త్రిగుణాతీతుడై, కుండలినీ యోగ సిద్ధుడై ఆనందమయ స్థితిని పొంది, చరితార్థుడు కావాలని తన శరీరాకృతి నాగ యజ్ఞోపవీతంతో తెలియజేసి, హెచ్చరించేవాడు - బొజ్జ గణపయ్య.
వౌషిక వాహనం: అంతరార్థం
మూషికం (ఎలుక) వాసనామయ జంతువు. తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది, బోనులో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పడతారు. మూషిక వాహనుడుగా, వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు - వినాయకుడు. అంతేకాదు, అహంకారానికి చిహ్నం ఎలుక (మూషికం). అహంకారం బుద్ధిమంతుల్ని పతనం చెందిస్తుంది. బుద్ధిపతి అయిన మహా గణపతి దానిని మలిచి జయించి సద్వినియోగం చేస్తాడు. మూషిక వాహనుడైన గణపతి సమృద్ధినిస్తాడు.
గణపతికి గరికతో పూజ ప్రీతిపాత్రం ఎందుకు?
వినాయకునికి గరికపూజ అంటే ప్రీతిపాత్రం అంటారు. వినాయక చవితి నాడే కాక, ప్రతిరోజూ గణపతికి ఆలయంలోనూ, గృహంలోనూ గరికతో స్వామిని అర్చిస్తారు. పూజా ద్రవ్యములతో గరికను కూడా జతచేసి సమర్పిస్తారు భక్తులు. దీనికి జానపదులు చెప్పుకొనే కథ ఒకటి ఉన్నది. పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతున్నారట. న్యాయనిర్ణేతగా నందీశ్వరుణ్ణి ఎంపిక చేశారు. ఈశ్వరుడే గెలిచాడని నంది తీర్పు చెప్పాడు. అయితే అమ్మతో నిజం చెప్పాడు. ఈశ్వరుడు నాకు తండ్రి, ప్రభువు తల్లీ. ఆయనే నా ప్రాణం. అందుకే ఆయన గెలిచినట్లు చెప్పాను. అయినా ఆయన అర్ధనారీశ్వరుడు గదమ్మా, మీ ఇద్దరూ ఒకటే’ అన్నాడు నంది. అందుకు అమ్మ ‘నందీ నీవు నయం కాని రోగంతో బాధపడతావు’ అని శపించింది. అయినా నంది దీనావస్థను చూచి జాలి చెంది, ‘నందీ నా కుమారుడు గణనాథుని పుట్టిన రోజున నీకు ఇష్టమైన పదార్థాన్ని అర్పితం చెయ్యి, అతని అనుగ్రహంతో నీకు శాప విమోచనం కలుగుతుంది’ అని సెలవిచ్చింది, పార్వతీదేవి. నంది తన కిష్టమైన గరికను గణపతిని అర్పించి పూజించాడు. అతనికి శాపవిముక్తి కలిగింది. ఇది వినాయక చవితి రోజున చేసే పూజలో గరికకు ఉన్న ప్రాధాన్యత.
‘సహస్ర పరమాదేవీ శతమూలా శాతాంకురా సర్వణ్‌ం హరతు మే పాపం దుర్వాదుస్వప్న నాశినీ’ సకల కల్మషములను తొలగించే సర్వశ్రేష్ఠమైన ఓషధీ, లెక్కకు మించిన కణుపులు, చిగుళ్లు కలిగి దుష్ట తలంపుల ప్రభావమును తొలగించు శక్తి గల పరమాత్మ స్వరూపమైన దూర్వాయుగ్మము, మనలోని మాలిన్యాన్ని తొలగిస్తుంది, అని ‘దూర్వాసూక్తము’ పేర్కొన్నది. దూర్వాయుగ్మము అంటే గరిక. అందుకే గణపతిని గరికతో అర్చిస్తే సర్వ శుభాలను ప్రసాదిస్తాడు. మనోమాలిన్యాలను తొలగిస్తాడు. దుస్వప్నాలు వస్తే, తెలియని భయాందోళనలు కలిగితే, గరికను తీసికొని, పైన చెప్పిన మంత్రాన్ని మూడుసార్లు చదివి, గరికను తలక్రింద పెట్టుకుని పడుకొని, తెల్లవారిన తరువాత తీసేయాలి. దుస్వప్నములు రావు, భయాందోళనలు దూరవుతాయని పెద్దలు చెప్తారు.
‘గజ’ శబ్దార్థము
వశీ - శివ, హింస - సింహ, పశ్యకః - కశ్యపః అని వర్ణ వ్యత్యాసముతో మార్పు కలుగుతుంది. ఇదొక వ్యాకరణ శాస్త్ర ప్రక్రియ. ఆ విధంగా, ‘జగ-గజ’ అని మారుతుంది. కనుక గజాననుడంటే ‘జగదా - ననుడు’ అని అర్థం. జగత్తే ముఖముగా కలవాడు - గజాననుడు. మరొక అంతరార్థం పరిశీలిద్దాం. ‘గ’ అనగా లయము, ‘జ’ అనగా జన్మ. కనుక ‘గజ’మనగా సృష్టి, స్థితి, లయములు గల జగత్తు అని అర్థం. మరొక విశేషార్థము, ‘గ’ అంటే జ్ఞానము, ‘జ’ అంటే పుట్టినది. ‘గజ’ అంటే జ్ఞానము వలన పుట్టినది, ఏది? మోక్షము అని అర్థం. ‘జ్ఞాన దేవతు కైవల్యం’ కనుక గజముఖము, గజాననుని ముఖ దర్శనము - శుభప్రదము, జ్ఞానప్రదమని, మోక్ష ప్రదమని తెలియపరుస్తోంది.
గణపతి - లలితా పరమేశ్వరి
‘శాంతిః స్వస్తిమతీ కాంతిః నందినీ విఘ్ననాశినీ’ అన్నది లలితా సహస్ర
నామం. లలితాదేవి విఘ్నములను అవిద్యను నశింపజేస్తుంది, కనుక ‘విఘ్ననాశిని’ అని పేరు కలిగింది. మరి గణపతి కదా విఘ్నములను లేకుండా చేసేవాడు? దీనిని బట్టి, లలితా దేవి గణపతి స్వరూపిణి, గణపతి లలితా స్వరూపుడు, అని తెలుస్తుంది. లలితా పరమేశ్వరికి, గణపతికి అభేదం. మరొకటి కూడా లలితా సహస్ర నామాలలో మనకి కనపడుతుంది - ‘మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా’ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా’ - అనేవి శ్రీ లలితాదేవికి, గణేశ్వరునికి అభేదాన్ని విశదపరుస్తాయి.
విష్ణు సహస్ర నామములలో గణపతి: ఏకదంతుడు
ఏకదం - అంతా ఒక్కటే, రెండవది లేదు, అని ఏకత్వ బుద్ధిని అనుగ్రహించు అని ఆ ఏకదంతుని ఉపాసించాలి. ‘అనేకదం’ - ఉపాసకులకు భక్తులకు అనేకములనిచ్చు, తం - గణేశుని, ‘అనేకదంతం’ ప్రళయ కాలంలో అనేకములను హరించు గణపతిని ఉపాసించాలి అని అర్థములున్నాయి. ‘ఏకః నైకః సవః కః కం’ యత్తతృద మనుత్తమమ్’ అన్న విష్ణు సహస్ర నామముల భావమే ‘ఏకదః అనేక దః’ అని చెప్పారు.
ముత్తుస్వామి దీక్షితులు: మహాగణపతి కీర్తనలు
వినాయక చవితి రోజున ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షితుల వారి ముఖ్యమైన కీర్తన, విశేష ప్రాచుర్యం పొందినది, హంస ధ్వని రాగ కీర్తన ‘వాతాపి గణపతిం భజేహం’ అన్న కీర్తనను జ్ఞప్తి చేసుకోవాలి.ఏమంటున్నాడా కీర్తనలో గణపతి గురించి, ‘వారణాస్యం వరప్రదం, భూతాది సంసేవిత చరణం, భూత భౌతిక ప్రపంచ భరణం, విశ్వకారణం, విఘ్నవారణం’ అంటూ ‘పురా’ అనగా సనాతనుడైన అగస్త్యముని వరునిచే పూజింపబడిన వాడు, త్రికోణాకారము గల మూలాధార చక్ర మధ్య యందుండేవాడు, మురారి అనగా మురాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు మొదలైన ముఖ్యులచే ఉపాసింపబడినవాడు, పరా పశ్యంతి మధ్యమా వైఖరీ అనే నాలుగు విధములైన వాగ్రూపుడు, ప్రణవ స్వరూపుడు, పాపములను తొలగజేయువాడు, ‘వాతాపి గణపతి’ అని చెప్తూ ‘హరాది గురుగుహ తోషిత బింబం హంస ధ్వని భూషిత హేరంభం’ అని వాతాపి గణపతి నుద్దేశించిన దివ్యనామ కీర్తనను, హంసధ్వని రాగంలో అందించాడు - ముత్తుస్వామి దీక్షితులు. దక్షిణ దేశాన్ని పల్లవరాజులు పరిపాలించే కాలంలో వారి రాజధాని ‘వాతాపి’. ఆ కాలంలో వాళ్లు శిల్పకళను బాగా పోషించారు, ప్రోత్సహించారు. వాతాపి గ్రామం నుండి ప్రత్యేకముగా తెచ్చి తిరువారూరులో ప్రతిష్ఠింపబడుటచే, ఆ గణపతి మూర్తికి ‘వాతాపి గణపతి’ అనే పేరు ఏర్పడింది. దీక్షితార్, గణపతి మీద ఇంకా ఎన్నో కీర్తనలు అందించాడు. ‘మహా గణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామ దేవాది వందిత’ నాట రాగ కీర్తన, గజానన యుతం గణేశ్వరం భజామి సతతం సురేశ్వరం’ ఇత్యాదులు వినాయక చవితికి స్ఫూర్తినిచ్చే ఆణిముత్యాల వంటి కీర్తనలు.
ఏకమేవా ద్వితీయం బ్రహ్మ
ఉన్నదొక్కటే, అదే పరబ్రహ్మ చైతన్యము. అందరిలోనూ ఉన్నది ఆ ఒక్క చైతన్యమేనని, తనలో నున్న చైతన్యమే ఎదుటి వారిలో కూడా ఉన్నదని, కనుక సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వ మానవ కల్యాణాన్ని వీక్షించాలని హెచ్చరిస్తున్నాడు - ఏకదంతుడు.
శ్రీగణపతి - త్యాగయ్య
శ్రీ గణపతి అనగా లక్ష్మీయుక్తుడైన గణపతిని బ్రహ్మాది దేవతలు కూడా సర్వకార్యారంభము లందును పూజించి, సిద్ధి ప్రదమును పొందుతారని, అందునా పాదములకు అలంకరించుకున్న అందెలు ఘల్లుఘల్లుమని మంగళ నినాదములు చేస్తున్న నాట్య గణపతిని సేవించండని, సౌరాష్ట్ర రాగంలో ఆది తాళ నిబద్ధనలో శ్రీ గణపతిని సేవింపరారే శ్రీత మానవులారా అన్న నాద యోగి త్యాగరాజస్వామి కీర్తన, వినాయక చవితికి దీప్తినిస్తుంది.
వినాయకుని సందేశం
పుట్టుకకు, జీవించటానికి, గమ్యాన్ని చేరుకోవటానికి ఏ తల్లిదండ్రులు ఆధారమో, వారే జీవిత లక్ష్యమునకు కూడా ఆధారమనే సత్యసూక్తిని అందించాడు వినాయకుడు.
మహాభారత రచనకు లేఖకునిగా వ్యవహరించిన సందర్భంలో మధ్యలో ఘంటము విరిగిపోయినప్పుడు, తన దంతమును కలముగా చేసికొని, మహాభారత రచనకు విఘ్నము కలుగకుండా చేసి ‘త్యాగేనైకా అమృతత్వమానసుః’ అనే ఆదర్శాన్నందించాడు - వినాయకుడు.
అహంకారాన్ని దరికి రానీయక, భూత దయ కలిగి స్వార్థరహితంగా, త్యాగబుద్ధితో అమృతమైన మనస్సుతో సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వ మానవ కళ్యాణాన్ని వీక్షించే వారికి ఎదురయ్యే విఘ్నాలను నేను తొలగిస్తానని అభయ హస్తం యిస్తున్నాడు, మహాగణపతి వినాయక చవితి పండుగ రోజున. *

-పసుమర్తి కామేశ్వరశర్మ 94407 37464