క్రైమ్/లీగల్

మృత్యువులోను వీడని బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైరెడ్డిపల్లి, అక్టోబర్ 27: మృత్యువులోను భర్తతో పాటు భార్య మృతి చెందిన సంఘటన మండలంలోని కుప్పనపల్లిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ భర్తను రక్షించబోయి భార్య కూడా బావిలో పడి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుప్పనపల్లిలో నివసించు సోమశేఖర్(38)కు ఇటీవలన ఆరునెలల క్రితం పవనమ్మ(28)తో రెండో వివాహం జరిగింది. సోమశేఖర్‌కు తొలుత ఒక మహిళతో వివాహమైంది. ఆమె మృతి చెందడంతో ఆరు నెలల క్రితం సోమశేఖర్ పవనమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు పది సంవత్సరాల కుమారుడు దినేష్ ఉన్నాడు. ప్రస్తుతం ఆ బాలుడు స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. సోమశేఖర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం భార్య, భర్తలిద్దరు వరి పంటకు నీరు కట్టడానికి పంట పొలం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో బావి గట్టు వద్ద సోమశేఖర్ ఉండగా అకస్మాత్తుగా ఆయనకు మూర్చ రావడంతో సొమ్మసిల్లి బావిలో పడిపోయాడు. ఈ విషయాన్ని పసిగట్టిన పవనమ్మ తన భర్తను రక్షించబోయి ఆమె కూడా బావిలో పడింది. దీనితో ఈత రాకపోవడంతో పవనమ్మ, బావిలోపడ్డ సోమశేఖర్ మూర్చతో నీటిలో మునిగిపోవడంతో ఇరువురు మృత్యువాత పడ్డారు. అయితే ఇరువురు బావిలో మృతి చెందిన విషయాన్ని పసిగట్టిన స్థానికులు బైరెడ్డిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది వరకే తల్లిని పోగొట్టుకున్న పదేళ్ల దినేష్‌కు తండ్రి ఆదరణ కరవై అనాథయ్యాడు. దీనితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.