క్రైమ్/లీగల్

చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినేపల్లి, మే 26: మండలంలోని నందీ వడ్డేమాన్ బీమ సముద్రం చెరువులో శనివారం ఉదయం ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి చెందిన విషాధకరమైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యాదయ్య కుమారుడు ధర్మతేజ(10), హన్మంత్‌రెడ్డి కుమారుడు ప్రవీత్‌రెడ్డి(10), మరో బాలుడు కిరణ్ కలిసి బీమా సముద్రం చెరువుకు ఈతకు వెళ్లారు. కిరణ్ స్నానం చేసి ఒడ్డున కూర్చోగా, ధర్మతేజ, ప్రవీత్‌రెడ్డిలు నీటిలో కేరింతలు కొడుతూ ఇంకా చెరువులోపలికి వెళ్లగా, అక్కడ ఎక్కువ లోతు ఉండటంతో మునిగిపోయారని తెలిపారు. ఒడ్డున ఉన్న కిరణ్ హుటాహుటిన సమీపం పొలంలో ఉన్న వారికి సమాచారం ఇవ్వగా, వారు సంఘటన స్థలానికి వచ్చి వెతుకగా, ధర్మతేజ అప్పటికే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న ప్రవీత్‌రెడ్డిని సప్పరెలు చేసి నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. ఇద్దరు పిల్లల మృతితో గ్రామంలో విషాధచ్చాయలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు బాలుర మృతదేహాలను నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రదీప్‌కుమార్ తెలిపారు.