క్రైమ్/లీగల్

వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, మే26: మండలంలోని వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య చేసుకొన్న సంఘటన శనివారం చోటు చేసుకొంది. ధర్మవరం గ్రామానికి చెందిన బట్న భాగ్యలక్ష్మి (30) తన భర్త వికలాంగుడు కావడంతో కుటుంబ సభ్యులు అవహేళన చేసేలా మాట్లాడటం వల్ల మనస్తాపానికి గురై చీమలమందు తాగి మృతి చెందింది. ఈమెకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. సమాచారం తెలుసుకొన్న పోలీసులు భాగ్యలక్ష్మి మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్ ఎం పురం సమీపంలో:
ఎస్ ఎం పురం సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 45 ఏళ్లు వయసు కలిగిన యువకుడు షార్ట్ ధరించి ఉన్నాడు. పోలీసులు మాత్రం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి బిచ్చగాడిగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు రావలసివుంది. మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఎస్సై ఎస్.క్రిష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.