క్రైమ్/లీగల్

మద్యం మత్తులో భార్యను కడతేర్చిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట టౌన్, మే 26:మద్యం మత్తులో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త ఉదంతం శనివారం రాజంపేట పట్టణం మన్నూరు దళితవాడలో వెలుగు చూసింది. పొగతతోటి రాముడు శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య ఆదిలక్షుమ్మ (45) రోజు మద్యం ఎందుకు తాగుతున్నావని నిలదీయడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరగడంతో ఇనుపరాడ్‌తో తలపై మోదగా భార్య అక్కడిక్కడే మృతి చెందింది. ఆదిలక్షుమ్మ ఇటీవల భర్తతో గొడవ పడి విషం తాగి ఆస్పత్రి పాలైంది. రెండు రోజుల క్రితమే ఇంటికొచ్చిన ఆమెను గొడవ పడి రాడ్‌తో మోదడంతో మృతి చెందింది. తాపీపని చేసే రామయ్యకు ఇద్దరు పిల్లలు కలరు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ నరసింహులు, ఎస్సై మహేష్‌నాయుడు పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.