క్రైమ్/లీగల్

బస్సు-లారీ ఢీ.. ఒకని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనే్నకొత్తపల్లి, మే 26 : అతివేగం కారణంగా ఓ ప్రైవేటు బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని నాగసముద్రం గేట్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. రామగిరి సీఐ యుగంధర్ తెలిపిన వివరాలిలా వున్నాయి. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో 37 మంది ప్రయాణీకులతో బెంగళూరుకు వెళుతోంది. అయితే నాగసముద్రం గేట్ వద్దకు రాగానే ముందు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీని గమనించకుండా వెనుక భాగాన ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఈర్షద్‌బాషా (45) ప్రయాణీకుడు ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. ఏడుగురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. క్షతగాత్రులను అనంపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించామన్నారు. ఎస్‌ఐ మహమ్మద్ఫ్రీ కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.