క్రైమ్/లీగల్

లాంచీ మునక ఘటనలో యజమాని, సరంగు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, మే 24: గోదావరి నదిలో ఈ నెల 15వ తేదీన లాంచీ ప్రమాదానికి బాధ్యులైన లాంచీ యజమాని, సరంగును అరెస్టుచేశామని పోలవరం డీఎస్పీ ఎటివి రవికుమార్ తెలిపారు. వాడపల్లిలో జరిగిన విషాద సంఘటనలో 19మంది మృతిచెందిన విషయం విదితమే. లక్ష్మీ వెంకటేశ్వర సర్వీసు లాంచీ తూర్పు గోదావరి జిల్లా కొండమొదలు-దేవీపట్నం నడుమ తిరుగుతుంటుంది. నిబంధనలకు విరుద్ధంగా సిమెంటు బస్తాలు, సరుకులు, బైకులను కూడా అందులోనే రవాణా చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మంటూరు వద్దకు వచ్చే సమయానికి విపరీతమైన గాలి వీచడంతో లాంచీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒడ్డుకు తీసుకువెళ్లి ఆపమని కోరగా, లాంచీని నడుపుతున్న బండి మోహనరావు నిర్లక్ష్యంగా నడపడంతో గాలి, వానకు లాంచీ తిరగబడి మునిగిపోయింది.