క్రైమ్/లీగల్

బాలికపై గ్యాంగ్ రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుంగనూరు, మే 24: పనె్నండేళ్ల ఓ మైనర్ బాలికపై ఐదుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి పాల్పడిన వారు మైనర్లు కావడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గురువారం ఉదయం పలమనేరు డిఎస్‌పి చౌడేశ్వరి పుంగనూరు పోలీసుస్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు పట్టణం భగత్‌సింగ్‌కాలనీకి చెందిన పనె్నండేళ్లు ముస్లిం మైనార్టీ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఐదుగురు మైనర్ బాలురు ఒక్కొక్కొరు పలుమార్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి ద్వారా తెలుసుకున్నామన్నారు. మైనర్లు ఈవిషయాన్ని వీధిలో కూర్చుని చర్చించుకోవడంతో సామూహిక అత్యాచారం వెలుగు చూసిందన్నారు. దీనిపై భగత్‌సింగ్‌కాలనీ స్థానికులు యువకులకు దేహశుద్ధి చేశారన్నారు. నిందితులైన ఐదుగురు మైనర్‌లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలికను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు డిఎస్‌పి వెల్లడించారు.