క్రైమ్/లీగల్

మంగినపూడి బీచ్‌లో యానాది మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 24: మద్యం మత్తులో మరో ఇరువురు వ్యక్తులతో కలిసి వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో మంగినపూడి బీచ్ సమీపంలోని సరుగుతోటల్లో భార్యను హతమర్చిన భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బందరు తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలోని మంగినపూడి బీచ్ వద్ద సరుగుతోటల్లో బుధవారం ఉదయం వివాహిత మహిళ హత్యకు గురైంది. తాళ్లపాలెం గ్రామ పంచాయతీ శివారు బోట్లవానిపాలెంలో మృతురాలు గంధం వెంకటేశ్వరమ్మ తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది. యానాది కులానికి చెందిన వీరు ఇరువురు బీచ్ సమీపంలోని ఓ మద్యం దుకాణంలో క్లీనింగ్ పని చేస్తున్నారు. బుధవారం ఉదయం బార్ క్లీన్ చేసిన సమయంలో వీరు ఇరువురు పూర్తిగా మద్యం సేవించారు. భార్య మాంసం తీసుకురమ్మని చెప్పటంతో భర్త చికెన్ తీసుకువచ్చేందుకు వెళ్లాడు. ఆ తర్వాత బార్‌కు ఇరువురు వ్యక్తులు వచ్చి వెంకటేశ్వరమ్మకు మరింత మద్యం పోయించి పక్కనే ఉన్న సరుగు తోటల్లోకి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న భర్త అక్కడకు వెళ్లి కోపోద్రిక్తుడై భార్య వెంకటేశ్వరమ్మ సరుగుడు కర్రతో దారుణంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ విషయం రాత్రి పొద్దుపోయే వరకు బయటకు రాలేదు. వీఆర్‌ఎ ద్వారా సమాచారం అందుకున్న తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్‌ఐ రంగనాధ్ అర్ధరాత్రి 12గంటల సమయంలో మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం డీఎస్పీ యండీ మహ్మద్ బాషా మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి కుమార్ తెలిపారు. హత్య చేసిన భర్త పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.