క్రైమ్/లీగల్

ఆటో ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, మే 24: నందిగామ - మధిర రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో 8మంది గాయపడ్డారు. సేకరించిన సమాచారం ప్రకారం కంచికచర్ల మండలం కీసర నుండి శుభ కార్యం నిమిత్తం నాలుగు ఆటోల్లో పలువురు గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామానికి వెళుతుండగా మాగల్లు గ్రామం వద్ద ఒక ఆటో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంతో నూతక్కి శాంతమ్మ (45) ఆమె సోదరి కోట చిన మేరి (41)లు మృతి చెందగా , జాన్, వేల్పుల లక్ష్మి, తిరుపతిరావు (ఆటో డ్రైవర్), కస్తాల రూసెమ్మ తదితరులు గాయపడ్డారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.