క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వార్డు సభ్యుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, మే 21: రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మూడవ వార్డు సభ్యుడు మహ్మద్ యాసీన్ (28) జగిత్యాల మండలంలో కోరుట్ల రహదారిలో రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందాడు. యాసీన్ జగిత్యాలలో లైబ్రేరియన్ పరీక్ష రాసి తిరిగి వస్తుండగా నిజామాబాద్ నుండి వరంగల్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు యాసీన్ ద్విచక్ర వాహానాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 2014 ఎన్నికల్లో రుద్రంగి నుండి వార్డు సభ్యునిగా పోటీ చేసి భారీ మెజారిటితో గెలుపొందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లి జమీలా, తండ్రి రాజమహ్మద్ రోధించడం పలువురిని కలిచివేసింది.