క్రైమ్/లీగల్

బాలికపై పాస్టర్ అత్యాచారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవెలకుంట్ల, ఏప్రిల్ 26:11 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన కోవెలకుంట్ల మండలంలో ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి ఆళ్లగడ్డ డీఎస్పీ చక్రవర్తి తెలిపిన వివరాలు.. రేవనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని వల్లంపాడు గ్రామానికి చెందిన లింగధారి ఓలం సుబ్బయ్య అదే గ్రామంలోని చర్చిలో పాస్టర్‌గా బోధనలు చేస్తుంటాడు. అతడికి గ్రామంలోనే ఒక కిరాణా కొట్టు ఉంది. కాగా ఈ నెల 23వ తేదీ కిరాణా కొట్టుకు వచ్చిన 11ఏళ్ల బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటికి వెళ్లిన బాలికకు అధిక రక్తస్రావం అవుతుండడంతో బాలిక బంధువులు హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలికకు కాస్త మందబుద్ధి కావడంతో జరిగిన ఘటన గురించి సరిగా చెప్పలేక పోవడం, బంధువులు బాలిక రసజ్వల అయ్యి అదే సమయంలో కింద పడడంతోనే అధిక రక్తస్రావం అవుతుందని భావించారు. ఈ విషయంపై గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయామని డీఎస్పీ తెలిపారు. అయితే రెండు రోజులైనా రక్తస్రావం ఆగకపోవడంలో వైద్యలు అనుమానం వ్యక్తం చేయడంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రేవనూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడు పాస్టర్ సుబ్బయ్యను గురువారం వల్లంపాడు గ్రామంలో అదుపులోకి తీసుకుని, విచారించి కోర్టులో హాజరు పరచి రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.