క్రైమ్/లీగల్

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఏప్రిల్ 25: ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పుంగనూరు పట్టణంలో చోటుచేసుకుంది. పుంగనూరు పట్టణ ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.. చిత్తూరుజిల్లా పుంగనూరు పట్టణం బజారువీధికి చెందిన శివలింగయ్య కుమార్తె భవాని (20) మదనపల్లె పరిసర ప్రాంతం మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం అభ్యిసిస్తోంది. ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మందలించారు. ఇంటిలోనే ఉంటున్న భవాని తన సెల్‌ఫోన్‌లో నిత్యం చాటింగ్ చేస్తుండగా గమనించిన తల్లిదండ్రులు మందలించి సెల్‌ఫోన్ లాక్కున్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన భవాని మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటినుంచి బయటకెళ్లింది. 9 గంటలకు గమనించిన తల్లిదండ్రులు తమ కుమార్తె భవాని కన్పించకపోవడంతో ఆందోళనకు గురై స్నేహితులు, బంధువులు ఇళ్లవద్ద విచారించారు. ఆచూకీ కన్పించకపోవడంతో తల్లిదండ్రులు బుధవారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే పుంగనూరు సమీపంలోని సుబ్బమ్మచెరువులో శవం కన్పిస్తోందని పోలీసులకు సమాచారం అందింది. పుంగనూరు సిఐ సాయినాధ్, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సంఘటన స్థలం సుబ్బమ్మచెరువుకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. భవాని(20) విద్యార్థిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రి శివలింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.