క్రైమ్/లీగల్
ఆరేళ్ల బాలికపై బిటెక్ విద్యార్థి అత్యాచారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గూడూరు టౌన్: నెల్లూరు జిల్లా గూడూరు శివారు చెన్నూరులో ఓ మానవమృగం ముక్కుపచ్చలారని ఆరేళ్ళ బాలికపై అత్యాచారం చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు, బంధువులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోట మండలం విద్యానగర్ ఎన్బికెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్న వర్షిత్ అనే విద్యార్థి ఆరేళ్ల చిన్నారి బాలికకు తినుబండారాలు ఆశ కల్పించి గత మూడు రోజుల క్రితం అత్యాచారం చేసినట్లు తెలిసింది. దీంతో బాలికకు విరోచనాలు, వాంతులు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై సమాచారం తెలుసుకుని ఆ మానవ మృగమైన వర్షిత్ను గూడూరు రూరల్ పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన రూరల్ ఎస్సై ఎం బాబీ బాలికను గూడూరు ఏరియా ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.