క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 3: హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేళ్లచెర్వు మండలం కందిబండ గ్రామానికి చెందిన అన్నదమ్ములు దేశబోయిన కిరణ్‌కుమార్ (30) దేశబోయిన నాగరాజు ఆసుపత్రిలో చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేందుకు సోమవారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో ఎపీ 16 డీజే 9793 నెంబర్ గల కృష్ణా జిల్లా గుడివాడకు వెళ్తున్న కారులో ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న కారు మంగళవారం తెల్లవారుజామున గుంపుల శివారుకు చేరుకున్న సమయంలో ముందు టైర్ పంక్చర్ అయి కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో కిరణ్‌తో పాటు కారు నడుపుతున్న గుడివాడకు చెందిన మద్దెల వెంకటస్వామి (35) అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న నాగరాజు, వెంకటస్వామి అత్త కాకర్ల జానకమ్మలకు తీవ్రగాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కిరణ్‌తండ్రి దేశబోయిన బ్రహ్మం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు చివ్వెంల ఎస్సై లవకుమార్ తెలిపారు.