క్రైమ్/లీగల్

ముస్తాబాద్‌లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, డిసెంబర్ 2: గన్నవరం మండలం ముస్తాబాద్‌లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కడుపు నొప్పి భరించలేక ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి, తాను ఆత్మహత్యా యత్నం చేసుకుంది. ఈ సంఘటనలో చిన్న కొడుకు కొండా శంకర్ (5) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం కొండా కోటేశ్వరరావు, అంకమ్మ భార్యాభర్తలు. వీరికి హేమంత్, శంకర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంకమ్మ కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తాను ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు అనాథలు అవుతారని భావించి అంకమ్మ తనతో పాటు పిల్లలను ఇద్దరినీ కూడా చంపేయాలనుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఎలుకల మందు తాను తాగి పిల్లలతో తాగించింది. చిన్న కొడుకు శంకర్ మృతి చెందాడు. పెద్ద కొడుకు హేమంత్, అంకమ్మను విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.