క్రైమ్/లీగల్

రైలు కింద పడి ముగ్గురి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం నగర శివారులోని సెంట్రల్ పార్కు సమీపంలోని మహదేవ్‌నగర్ వద్ద రైల్వే ట్రాక్‌పై తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే మూడవ పట్టణ సీఐ రెడ్డప్ప సంఘటనా స్థలానికి చేరుకుని మృతులను అనంతపురం నగర పరిధిలోని పాపంపేట సమీపంలో ఉన్న జాకీర్‌గుట్టకొట్టాలకు చెందిన వడ్డే పూలమ్మ(50), ఆమె కూతుళ్లు ఆర్తి(17), దీప (14)గా గుర్తించారు. శనివారం అర్ధరాత్రి ఇంట్లో భర్త వెంకటేశ్‌తో గొడవ పడిన పూలమ్మ తన ఇద్దరు కూతుళ్లను వెంట పెట్టుకుని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు.