క్రైమ్/లీగల్

20 తుపాకులు, 100 బుల్లెట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: పేలుడు పదార్థాలు విక్రయిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడిని ఢిల్లీలో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇతని నుంచి 20 తుపాకులతో పాటు వంద బుల్లెట్లను స్వాధీనం చేసుకొన్నట్లు డీసీపీ ప్రమోద్ సింగ్ కుష్వంత్ స్పష్టం చేశారు. యువకుడిని మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్ జిల్లాకు చెందిన రాజు దేశాయ్‌గా గుర్తించారు. అక్షరధామ్ సమీపంలో వీటిని అందజేసేందుకు రాజు దేశాయ్ ప్లాన్ చేశాడన్న విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియడంతో మాటువేసి అతన్ని అదుపులోకి తీసుకొని ఈ మారణాయుధాలను స్వాధీనం చేసుకొన్నట్లు చెప్పారు. విచారణలో గత రెండు, మూడు సంవత్సరాలుగా మారణాయుధాలను సరఫరా చేస్తున్నట్లు తేలింది. తుపాకులను ఆరు నుంచి తొమ్మిది వేలకు కొనుగోలు చేసి 15వేల నుంచి 20వేలకు అమ్ముతున్నాడనీ.. అలాగే బుల్లెట్లు 150 నుంచి 175 రూపాయిలకు కొనుగోలు చేసి 250 నుంచి 300 రూపాయిలకు అమ్ముతున్నాడని పోలీసు అధికారి స్పష్టం చేశారు.