క్రైమ్/లీగల్

గిరిజన బాలికపై అత్యాచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె: గిరిజన బాలిక(14)పై పూజారి అత్యాచారం జరిపాడు. ఈ సంఘటన కడప జిల్లా సుండుపల్లె మండలం మడితాడు పంచాయతీ జికె రాచపల్లెలో వెలుగు చూసింది. బాధితురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటికి చెందిన సత్యనారాయణ అలియాస్ బుల్లెట్ రవి గత కొనే్నళ్లుగా సుండుపల్లె మండలంలోని ఆలయాల్లో పూజారిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా జీకే రాచపల్లె ఆలయం పక్కన ఇంట్లో కొంతమందికి భగవద్గీత శ్లోకాలు నేర్పించేవాడు. ఈ క్రమంలో బుధవారం వానరాచపల్లె బిడికికి చెందిన గిరిజన బాలిక ఒక్కరే అక్కడికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన రవి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వైద్య పరీక్షల కోసం బాలికను రాయచోటి వైద్యశాలకు పంపినట్లు ఆయన తెలిపారు. రవి పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రాయచోటి రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.