క్రైమ్/లీగల్

హైవేలపై చోరీలకు పాల్పడుతున్న కంజారా ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 28: హైవేలపై చోరీలకు పాల్పడుతున్న కంజారా ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. భారీ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లోని వస్తువులను చాకచక్యంగా చోరీ చేయడం ఈ ముఠాకు వెన్నతోపెట్టిన విద్య. వాహనాలు వెళ్తుండగానే ముఠా సభ్యులు మోటార్‌బైక్‌లు, లారీల్లో వాటిని అనుసరించి గ్యాస్‌కట్టర్ సాయంతో తాళం తొలగించి లోపలికి వెళ్లి అందులోని విలువైన వస్తువులను దొంగలించేవారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాంజా సురేష్‌కుమార్ అలియాస్ చెప్పా, ఆమ్ సిసోడియా, బుందేలా సునీల్ ఈ ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని మిగతా సభ్యుల కోసం గాలిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు ఇటీవల కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ రహదారుల్లో వెళ్తున్న డీటీసీ వరల్డ్ ఫస్ట్ కొరియర్ కార్గో కంటైనర్ వాహనం తాళాన్ని ఐరన్ కట్టర్‌తో తొలగించి కంటైనర్‌లోకి ప్రవేశించి విలువైన సామగ్రిని దొంగలించారు. ఈ సంఘటనపై నిఘా పెట్టిన పోలీసులు ముగ్గురు సభ్యులను అరెస్టు చేశారు. వీరి నుంచి సెల్‌ఫోన్లు, చీరలు, రెండు లారీలు, 2 పిడి బాకులు, ఐరన్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు.