క్రైమ్/లీగల్

జహీరాబాద్ ఎంపీ తప్పుడు అఫిడవిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: జహీరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్ధి , ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని, ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించలేదని ఆయన ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. మదన్‌మోహన్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా బీబీ పాటిల్, ఎన్నికల కమిషన్‌ను, టీఆర్‌ఎస్ పార్టీలను పిటిషన్‌లో చేర్చారు. విచారించిన హైకోర్టు ఆరువారాల్లోగా కౌంటర్‌ను దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా, మదద్‌మోహన్‌రావు 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి బీబీ పాటిల్ చేతిలో ఓడిపోయారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను చేపట్టనుంది.