క్రైమ్/లీగల్

వృద్ధుడి ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండాల, అక్టోబర్ 11: భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని తుర్కల షాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాల కారణంగా గ్రామంలోని కొర్నె సూరయ్య (70) తన భార్య మాణిక్యమ్మను (60) పదునైన కత్తితో గొంతుపై మెడ భాగంలో తలపై విచక్షణ రహితంగా నరకడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మాణిక్యమ్మ అంగన్‌వాడి ఆయాగా పనిచేస్తుంది. అంగన్‌వాడి కేంద్రంలో విరామ సమయంలో నిద్రిస్తున్నప్పుడు భార్యపై దాడి చేసి చంపిన భర్త సురయ్య గ్రామంలో తన ఇంటికి వెళ్లి ఇంటి ఇనుప పైపునకు ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా కుమారుడు కొర్నె సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు రఘునాథ్‌పల్లి సీఐ చంద్రశేఖర్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అలేరు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఆయన వెంట ఏఎస్సై భిక్షంగౌడ్ ఉన్నారు.