క్రైమ్/లీగల్

అమెరికాలో నాగోలు నివాసి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, అక్టోబర్ 7: నాగోలులో నివాసం ఉంటున్న వివాహితురాలు అమెరికాలో అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోలు సాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వనిత(38) ఎల్బీనగర్ కొత్తపేట ప్రాంతానికి చెందిన రాచకొండ శివ కుమార్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం క్రితం అమెరికా వెళ్లి నార్త్ కరోలినాలో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలతో నాగోలు సాయినగర్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటుంది. రెండు నెలల క్రితం వనిత తిరిగి అమెరికాకు వెళ్లిపోయింది. భర్త వేధింపులు మరింత తీవ్రం కావడంతో ఆత్మహత్య చేసుకుంటానని అనేక సార్లు తల్లిదండ్రులకు తెలిపింది. అమెరికాలో అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్లు వనిత తల్లిదండ్రులకు సోమవారం సమాచారం వచ్చింది. అల్లుడు శివ కమార్‌పై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.