క్రైమ్/లీగల్

కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఏసీబీ అధికారులు 13 వ్యక్తులను అరెస్టు చేశారు. తాజాగా సోమవారం ఈ కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వెంకటేశ్వర హెల్త్‌కేర్ ఎండీ అరవింద్ రెడ్డితో పాటు కె.లిఖిత్ రెడ్డి, కె.అరవింద్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈఎస్‌ఐకి పరికరాలు సరఫరా
చేసినట్టుగా తప్పుడు పత్రాలను సృష్టించి అవినీతికి పాల్పడినట్లు అధికారులు తేల్చారు. 2013 నుంచి ఆయన అక్రమాలకు పాల్పడుతున్నారు.