క్రైమ్/లీగల్

నగర శివార్లలో దొంగల హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, సెప్టెంబర్ 18: నగర శివార్లలో దొంగలు హల్‌చల్ చేశారు. తాళం పగులగొట్టి ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లి కమలానగర్‌లో నివసిస్తున్న జీ.సతీష్ కుమార్ ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అతడు కుటుంబ సభ్యులతో కలిసి కూకుట్‌పల్లిలో బంధువుల బర్త్‌డే ఫంక్షన్‌కు ఇంటికి తాళం పెట్టి మంగళవారం సాయంత్రం వెళ్లారు. తిరిగి బుధవారం ఇంటికి వచ్చి చూడగా దొంగలు తాళం పగులగొట్టి అల్మారాలోని 19 తులాల బంగారు ఆభరణాలతో పాటు పక్కనే ఉన్న రూ.3.5లక్షలను ఎత్తుకెళ్లారు. పైన ఉన్న మరింత బంగారం, వెండి వస్తువులను తీసుకోకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అందిన సమాచారం మేరకు ఏసీపీ గోనె సందీప్, క్రైం సీసీసీ ఏసీపీ జగన్నాధ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి, ఎస్‌ఐలు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూసు టీంను రప్పించి దర్యాప్తు చేపట్టారు. బోడుప్పల్ శ్రీనివాస కాలనీలో జరిగిన దొంగతనం సంఘటన మరువకముందే ఈ సంఘటన జరుగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.