క్రైమ్/లీగల్

దొంగ నోట్లు మారుస్తున్న వ్యక్తుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఏప్రిల్ 13 : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దొంగనోట్లను మార్పిడి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదోని డీఎస్పీ ప్రసాద్ తెలిపిన వివరాలు.. ఈ నెల 12వ తేదీ ఆదోని పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి ఇచ్చిన రూ. 200 నోటును నకిలీదిగా గుర్తించి బంకు మేనేజర్ ఫిర్యాదు చేశాడన్నారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించగా గురువారం ఉదయం పట్టణంలోని ఓ డాబా వద్ద బసాపురం గ్రామానికి చెందిన కమ్మ కిష్టప్పను అరెస్టు చేయడంతో పాటు అతడి నుంచి రూ. 25వేల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. అలాగే కిష్టప్ప ఇచ్చిన సమాచారంతో పత్తికొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.