క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 13: ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలోని రైతు యాసరవేణి పర్శరాములు(50) అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. వారి కథనం మేరకు గ్రామంలోని పర్శరాములు ఉన్న ఊరిలో ఉపాధి లేక ఎనిమిదేళ్ల కిందట గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అక్కడ సరైన పనులు లభించక ఇంటి ముఖం పట్టాడు. తనకున్న 2.5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. రూ.3లక్షలు అప్పులు చేసి బోరు బావులు తవ్వించాడు. చుక్క నీరు రాలేదు. బోరు బావులు, పంట సాగుకు మొత్తం రూ.8లక్షల అప్పులయ్యాయి. వేసిన పంట ఎండిపోవడంతో బాకీలు ఎలా తీర్చాలని మదన పడ్డాడు. మనస్థాపం చెందిన పర్శరాములు వ్యవసాయ పొలం వద్ద వెళ్లి ఓ చెట్టు ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుడికి భార్య నాగలక్ష్మీ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.