క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ఎమ్మెల్యే భాస్కర్‌రావు పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, ఆగస్టు 16: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన వేములపల్లి మండల కేంద్రంలోని నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. వేములపల్లి ఎస్‌ఐ సుధీర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణం చైతన్యనగర్‌కు చెందిన మల్లంపాటి వీరాంజనేయులు (50), డ్రైవర్ అయిన బంగారిగడ్డ కాలనీకి చెందిన గూడపూరి శ్రీను (55) తో కలిసి ద్విచక్ర వాహనంపై సొంత పని నిమిత్తం మాడ్గులపల్లికి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యమైన వేములపల్లి మండలానికి చేరుకోని మిర్యాలగూడ నుండి నల్లగొండ వైపు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనం వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరాంజనేయులు, శ్రీనుల తలలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఇరువురిని అంబులెన్స్‌లో మిర్యాలగూడ ఏరియా ఆసుప్రతికి తరలించగా వారిని పరిశీలించిన వైద్యులు మార్గమధ్యంలో మృతి చెందినట్లు నిర్ధారించారు. దాంతో వీరాంజనేయులు భార్య లక్షమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు.