క్రైమ్/లీగల్

వాహనం సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకాల, ఏప్రిల్ 2: వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తూ డ్రైవర్ పట్టుబడిన సంఘటన సోమవారం సాయంత్రం తిరుపతి-చిత్తూరు జాతీయ రహదారిలోని పాకాల మండలం ఇరుగురంగయ్యగారిపల్లి వద్ద జరిగింది. పాకాల ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు తిరుపతి నుంచి చిత్తూరువైపు వెళ్తున్న ఓ వాహనంపై అనుమానం వచ్చి తనిఖీ కోసం ఆపేందుకు కల్లూరు ఎస్‌ఐ విశ్వనాథనాయుడు బృందం ప్రయత్నించారు. వారిని తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఉండటంతో వాహనాన్ని పక్కనున్న పొలాల్లోకి మళ్లించి డ్రైవర్ పరారీకి యత్నించాడు. ఈ నేపథ్యంలో వాహనాన్ని స్వాధీనం చేసుకొని తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కూలకుప్పం గ్రామానికి చెందిన మురుగేశన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పాకాల ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వాహనంలో రూ.40వేలు విలువచేసే 3 ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.